శరీరం లో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాల మంచిది .గోంగూర ఆకు ఆముదం తో కలిపి వెచ్చ చేసి వ్రణాల పైన గడ్డల పైన కడితే త్వరగా తగ్గిపోతాయి .తరచూ గోంగూర వాడుతూ గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది .దగ్గు ఆయాసం తుమ్ములతో బాధ పడే వారికీ చాలామేలు చేస్తుంది .