Thursday, November 15, 2012

 ద్రాక్ష అంటే ఇష్టపడని వారు ఉండరు .వయసు మళ్ళిన వారి నుండి చంటి పిల్లలవరకు తినడానికి ఎంతో తేలికగా ఉంటుంది .

 ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి .అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి .

ఈ పండ్లలోని టన్నిస్ ఫాలిఫినాల్స్ కాన్సర్ సంబంధ కారకాల ఫై పోరాడుతాయి .

శరీరం లో క్రొవ్వు ను తగ్గిస్తాయి

 ఇందులో ఏంటి ఆక్సిడెంట్ దృష్టి లోపాలను సవరించి కంటి చూపు మెరుగుపరుస్తుంది .

తలనెప్పి తో బాధ పడేవారు ద్రాక్ష తింటే వెంటనే తలనెప్పి తగ్గిపోతుంది .

జీవం కోల్పోయిన జుట్టు కు ద్రాక్ష గింజలు నూరి పట్టిస్తే జుట్టు కాంతివంతం అవుతుంది .

ఇవి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి గుండె కవాటాల పని తీరు మెరుగుపరుస్తుంది
.
ఒక ద్రాక్ష పండు తీసుకుని బాగా మెత్తగా చెయ్యాలి .దీనిలో ఒక అర స్పూన్ పంచదార కలిపి ముఖానికి రాసుకుని పంచదార కరిగేదాకా సున్నితంగా మసాజ్ చెయ్యాలి .బాగా ఆరి పోయాక శుభ్రం గా కడిగేయాలి .ఇలా క్రమం తప్పకుండ చేస్తే రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం మీద మచ్చలు ,ముడుతలు పోయి ఎంతో బాగుంటుంది

ద్రాక్ష పండు ఫై త్యాన్ని వాతాన్ని హరిస్తుంది.
 నీరసంగా ఉన్నవారికి గ్రేప్ జ్యూస్ ఇస్తే వాళ్ళు ఎంతో హుషారు గా తయారవుతారు .
 పిల్లలకు తరచుగా ద్రాక్ష పెట్టడంవల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది .ఇవి తరచుగా తినడంవల్ల రక్తహీనత ఉండదు .

మూడు ద్రాక్ష పండ్లను మెత్తగా మెదిపి ఆ గుజ్జు లో ఒక స్పూన్ మిల్క్ పౌడర్ ఒక స్పూన్ గంధం కొంచం పాలు కలపి ముఖానికి పాక్ వేసుకుని పది నిమిషాలయ్యాక కడిగేస్తే ఎండాకాలం లో కలిగిన వేడి తగ్గుతుంది ఇది రాత్రిపూట చెయ్యడం వల్ల ఉదయానికి చర్మం తాజా గా ఉంటుంది