Thursday, November 15, 2012

ఆయాసం తగ్గడానికి మసాలా దినుసులు బాగా ఉపయోగపడతాయి .
అవి ఎలాగంటే ఒక  యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు,సొంఠి బిరియాని ఆకు తీసుకుని సొంఠి మిరియాలు విడి విడిగా నేతిలో వేయించాలి .అన్నీ కలిపి మెత్తగా పొడి చేసి ఈ మొత్తానికి సమానంగా పంచదార కలిపి ఒకటి లేక రెండు స్పూన్ల పొడి ని రెండు పూటలా తింటే ఆయాసం తగ్గిపోతుంది .
ఆయాసం ఉన్నవారు ఆహారం లో గోధుమలు ,సోయాబీన్స్ టమేటా ,ఎండు ద్రాక్ష  ఎక్కువగా తీసుకోవాలి .
అలాగే వీరు కాల్షియం ఎక్కువగా ఉన్న పాలకూర క్యారెట్ ఉసిరి వాము జీలకర్ర మొదలైనవి తప్పనిసరిగా
తీసుకోవాలి . అరిటిపండు పెరుగు చల్లటి నీరు తీసుకోరాదు 

ఎండు ఖర్జూరం వేడి నీటిలో నానబెట్టి ఆనీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఆ నీళ్ళ లో తేనె కలుపుకుని త్రాగితే అస్మా వారికి మంచిది .
మెంతులు అరస్పూన్ వాము ఒక స్పూన్ గ్లాస్ నీటిలో అర గ్లాస్ అయ్యే వరకు మరగించి వడపోసుకుని ఆ నీరు తాగితే ఆయాసం తగ్గుతుంది