Wednesday, November 14, 2012


అరటికాయి లు ,వంకాయి లు తరిగేటప్పుడు ఉప్పు కలిపిన నీటిలో తరిగితే నల్లబడవు  బియ్యం కడిగిన నీటిలో వేసిన కూడా నల్లబడవు .

కూరలు ఎక్కువ నూనె పోసి వేయించరాదు .ముందుగా కొంచం నీరు పోసి గాని ఆవిరి మీద గాని ఉడికించి తాలింపు పెడితే విటమిన్లు పోకుండా ఉంటాయి పైగా తక్కువ నూనె సరిపోతుంది .
కూరలు వండేటప్పుడు కావలసినంత నీరు మాత్రమే పొయ్యాలి.ఎక్కువ నీరు పోసి ఉడికించి ఆ నీటిని పారబోయడం వల్ల వాటిలో పోషకాలు పోతాయి .
కూరలు ఉడుకుతున్నపుడు అదీ ఆకు కూరలు ఉడుకుతున్నపుడు మూత పెట్టాలి .ఇలా చేస్తే విటమిన్ c నశించదు .
వండిన కూరలకు కొద్దిగా నిమ్మరసం కలిపితే మంచి రుచి .రంగు రావడమే గాక నీటి లో కరిగిపోయే పోషక పదార్ధాలు పోకుండా ఉంటాయి .