Wednesday, November 14, 2012

dry skin tips

చలి కాలం లో పిల్లలకు ఒళ్ళంతా పగిలి తెల్లగా అవుతుంది ఇలా కాకుండా ఉండాలంటే స్నానం చేసే నీటిలో ఒక నాలుగు చుక్కలు కొబ్బరి నూనే గాని ఆలివ్ ఆయిల్ గాని వేసుకోవాలి .

పచ్చి పాలు రోజ్ వాటర్ కలిపి స్త్నానం చెయ్యడానికి ఒక అరగంట ముందు ముఖానికి మెడకు చేతులకు పట్టించి ఆ తరువాత స్త్నానం చేస్తే చాల బ్రైట్ గా అవుతారు .ఇలా ముందు ఒక 15రోజులు చెయ్యాలి .తరువాత రెండు లేక మూడు రోజులకు సారి చేసినా సరిపోతుంది .
కప్పు రాక్ సాల్ట్ ను స్నానం చేసే నీటిలో కలపాలి .దీనివల్ల అలసట తగ్గుతుంది
.బకెట్ నీళ్ళలో ఒక కప్పు మిల్క్ పౌడర్ కలిపి స్నానం చేస్తే రోజు అంతా ఫ్రెష్ గా ఉంటుంది .అది కుదరకపోతే స్నానానికి ముందు పచ్చిపాలు చర్మానికి రాసుకోవాలి
.అలసట ,ఒత్తిడి తగ్గాలంటే గుప్పెడు తులసి ఆకులు గాని గుప్పెడు గులాబీ రేకులు గాని స్నానం చేసే నీటిలో వేసుకోవాలి
.నిమ్మ నూనె 5లేక 6చుక్కలు వేసుకుని స్నానం చేసినా కూడా ఫ్రెష్ గా ఉంటుంది .యూకలిప్టాస్ నునె కలిపి స్నానం చేస్తే శరీరం మంచి వాసన వస్తుంది .